తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈ యువ నటుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరో గా నటించి ఈ మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత జాతి రత్నాలు అనే కామెడీ ప్రాధాన్యత ఎక్కువ కలిగిన సినిమాలో హీరో గా నటించి ఈ మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకొని తన క్రేజ్ ను మరింత గా పెంచుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ... ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో నవీన్ పోలిశెట్టి సరసన అనుష్క శెట్టి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ మూవీ ని మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది.

మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం ... అలాగే ఈ ఈ మూవీ టీజర్ లో నవీన్ మరియు అనుష్క తమ నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టు కోవడంతో ప్రస్తుతం ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ టీజర్ కి ఇప్పటి వరకు 2 మిలియన్ ప్లస్ వ్యూస్ ను దక్కినట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: