టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో పరిచయమైంది ఈమె. అనంతరం చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది. ఈ మధ్యకాలంలోనే థాంక్యూ అనే సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె ఎక్కువగా తమిళంలో మరియు హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. మొన్నటి వరకు తెలుగులో వరుస సినిమాలో చేస్తూ బిజీగా మారిన ఈమె సరైన విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో తెలుగులో కాకుండా ఇతర భాషలపై ఆధారపడి అక్కడి సినిమాలలో నటిస్తుంది.

ఇక్కడైన విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం కోలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో కలిపి నాలుగు నుండి ఐదు సినిమాలు చేస్తోందని తెలుస్తోంది. ఇక ఇందులో యోధ సినిమా మాత్రం ఈమెకి మెమరబుల్ సినిమాగా ఎప్పటికీ నిలిచిపోతుందన్న వార్తలు సైతం వినపడుతున్నాయి. దీనికి కారణం ఈ సినిమా కాన్సెప్ట్ చాలా వెరైటీగా ఉంటుందని తెలుస్తుంది. ఇక అసలు విషయం ఏంటంటే సిద్ధార్థ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని తో పాటు రాశిఖన్నా కూడా హీరోయిన్గా నటిస్తోంది.ఇకపోతే ఇందులో హైజాక్ అయిన విమానాన్ని కాపాడే బాధ్యత ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా సిద్ధార్థ మల్హోత్రా తీసుకోబోతున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు హద్దులు మీరేలా ఉన్నాయన్న వార్తలు సైతం వినపడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ నేపథ్యంలోనే రాశిఖన్నా ఈ సినిమాలో శృంగార సన్నివేశాల్లో కాస్త కూడా తగ్గలేదు అన్న వార్తలు అయితే విపరీతంగా వినబడుతున్నాయి. ఎగిరే విమానంలో సిద్ధార్థ తో ఘాటైన సన్నివేశాల్లో నటించిన రాశిఖన్నా .అంతేకాదు విమానంలో హీరోతో రొమాన్స్ చేస్తూ ఎయిర్ ఫోర్స్ అధికారులకు కూడా దొరికిపోయే సీన్లు చాలా హైలెట్గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాటితోపాటు బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా చాలా ఘాటుగా ఉంటాయని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: