సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఈ సినిమాతో తన రేంజ్ ను కూడా అంతకంతకూ పెంచుకుంటున్నారు.

సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన సమయంలో ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తనకు కష్టకాలంలో అండగా ఉన్నవాళ్ల గురించి సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తనకు యాక్సిడెంట్ అయిన సమయం లో చాలామంది నుంచి సపోర్ట్ లభించిందని ఆయన చెప్పుకొచ్చారట.నా ప్రొడక్షన్ మేనేజర్లు ఇద్దరు సతీష్ లు యాక్సిడెంట్ సమయంలో నాకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించారని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరూ నా కుడి ఎడమ భుజాలుగా నిలిచి సహాయం చేశారని కూడా ఆయన కామెంట్లు చేశారు. నా వ్యక్తిగత డ్రైవర్ నాగికి కూడా చాలా థ్యాంక్స్ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. నాకు సపోర్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అయన కామెంట్లు కూడా చేశారు.

మరోవైపు విరూపాక్ష మూవీ రాబోయే రోజుల్లో వచ్చే కలెక్షన్లతో కలిపి 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం కూడా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ కథల ఎంపికలో మారితే మాత్రం మరిన్ని విజయాలు సొంతమవుతాయని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. సాయిధరమ్ తేజ్ కెరీర్ విషయంలో సొంతంగా నే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వినోదయ సిత్తం రీమేక్  షూటింగ్ ను కూడా ఆయన వేగంగానే పూర్తి చేసిన విషయం తెలిసిందే. వినోదాయ సిత్తం రీమేక్ లో పవన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం ఈ సినిమాకు బిజినెస్ విషయంలో కూడా ప్లస్ అవుతోంది. పవన్ స్ట్రెయిట్ సినిమాలకు జరుగుతున్న స్థాయిలోనే ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోంది. సాయితేజ్ రెమ్యునరేషన్ కూడా ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: