మే నెల వస్తే నందమూరి అభిమానులకు పండగే. ఎందుకంటే మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. తమ అభిమాన హీరో బర్త్ డే ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతి సంవత్సరం ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే.. 2019 నుండి ఇప్పటివరకు ఎన్టీఆర్ బర్త్డే మే 20న ఎటువంటి సర్ప్రైజ్ లు రావడం లేదు. గత ఏడాది తన పుట్టినరోజున కొరటాల శివతో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ దానిపై ఫ్యాన్స్ లో అంతగా ఆసక్తి నెలకొనలేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు గత ఏడాది ఫిబ్రవరి వరకు సెట్స్ పైకి వెళ్లనే లేదు. 

ఇక ఇంతలోనే ఇప్పుడు మే 20 వచ్చేస్తోంది. ఈసారి కచ్చితంగా కొరటాల శివ ఫ్యాన్స్ కోసం మంచి సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే. లేకపోతే ఈ సినిమాపై హైప్ ఏర్పడే ఛాన్స్ లేదు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ జాహ్నవి కపూర్, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ షూటింగ్లో జాయిన్ అయినట్టు అప్డేట్ ఇచ్చారు. కానీ ఆ అప్డేట్ ఫ్యాన్స్ కి సరిపోదు. ఇటీవల బన్నీ బర్త్ డే కి సుకుమార్ రిలీజ్ చేసినట్టు గ్లిమ్స్ వీడియోనో లేక మేకింగ్ వీడియో లాంటిది ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుంది. మరి ఎన్టీఆర్ బర్తడే కి కొరటాల అండ్ టీం గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేస్తారా? లేక పోస్టర్ తోనే సరిపెట్టుకుంటారా? అనేది చూడాలి ఇక ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.

తాజాగా ఎన్టీఆర్ పై భారీ ఫైట్ సీక్వెన్స్ తో లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ ని కంప్లీట్ చేశారు మూవీ టీమ్. ఇక మరోపక్క బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి 'వార్ 2' మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ ప్రాజెక్ట్ నుండి కూడా ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఒక సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సో ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కి డబుల్ సర్ప్రైజ్ ఉండబోతోందన్న మాట. ఇక వీటితో పాటే మే 20 న సింహాద్రి రీ రిలీజ్ కూడా ఉంది. రాజమౌళి - ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ మూవీని మళ్ళీ 4k వెర్షన్ లో థియేటర్స్ లో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద ఈసారి మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రచ్చ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: