టాలీవుడ్ లో యంగ్ హీరో నిఖిల్ ఎప్పుడూ కూడా విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ఉంటారు. తాజాగా నిఖిల్ నటిస్తున్న స్పై చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ చిత్రం పూర్తి స్కై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించినట్లు చిత్ర బృందం ఇది వరకే క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో నిఖిల్ పాత్ర అల్టిమేటివ్గా ఉండబోతుందని చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుంచి సడన్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. స్పై చిత్రం థ్రిల్లర్ మూవీ గానే కాకుండా భారత్కు సంబంధించిన హిడెన్ స్టోరీ ని ఈ సినిమాలు చూపించబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాను గ్యారీ డైరెక్టర్ చేస్తుండగా.. నిఖిల్ ఇంద్ర సరికొత్త లుక్కుల కనిపించబోతున్నారట ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ మిస్టరీని మనకు చూపించబోతున్నట్లుగా చిత్ర బృందం తెలియజేయడం జరిగింది. ఈ సినిమా జూన్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


స్పై సినిమా టీజర్ను మే 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు స్పై చిత్ర బృందం వెల్లడించింది ఈ సినిమా నుంచి వచ్చిన తాజా అప్డేట్ తో మరింత అంచనాలు పెంచే విధంగా కనిపిస్తున్నది. ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ నటిస్తూ ఉన్నది. ప్రొడ్యూసర్గా కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా అనౌన్స్మెంట్ తో ఈ సినిమాపై మరొకసారి ట్రెండీ గా మారుతోంది. చివరిగా నిఖిల్ కార్తికేయ-2,18 పేజీస్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.ఇప్పుడు తాజాగా మరొకసారి కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్పై సినిమా పైన మరొక సారి నిఖిల్ కూడా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: