టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. ఈసారి ఎలాగైనా గట్టి కం బ్యాక్ ఇవ్వాలని తనకు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందించిన దర్శకుడు శ్రీవాస్ తో హ్యాట్రిక్ మూవీ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇటీవల వచ్చిన 'రామబాణం' ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో జగపతిబాబు, కుష్బూ, శుభలేఖ సుధాకర్, అలీ, నాజర్ వంటి అగ్ర నటీనటులు సైతం నటించారు. మే 5న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద రామబాణం భారీ ప్లాప్ ను మూట గట్టుకుంది. 

ఇక ఈ సినిమాతో గోపీచంద్ ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా భారీగా పడిపోయింది. ఇక రామబాణం ప్లాప్ తో గోపీచంద్ తాజాగా ఓసంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ప్రస్తుతం తాను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ లో ఏకంగా సగం తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడట గోపీచంద్. తనతో సన్నిహితంగా ఉండే నిర్మాతల సూచన మేరకే గోపీచంద్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఓ మంచి హిట్ పడేంత వరకు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే మంచిదని, హిట్టు వస్తే ఆ తర్వాత నిర్మాతలే ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తారని గోపీచంద్ ఈ డెసిషన్ తీసుకున్నారట.

ప్రస్తుతం గోపీచంద్ ఒక్క సినిమాకు 15 నుంచి 20 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రామబాణం ప్లాప్ తో తన రెమ్యూనరేషన్లో సగం తగ్గించుకోవడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ హీరో సుమారు 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రామబాణం తర్వాత గోపీచంద్ ప్రజెంట్ హర్ష అనే దర్శకుడి తో ఓ సినిమా చేస్తున్నాడు  కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ తో 'వేద' సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు గోపీచంద్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: