నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం రష్మిక మందన వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ మలయాళ భాషల్లో సైతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ రష్మిక మందన స్టార్ హీరోయిన్గా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకుందో అదే స్థాయిలో వివాదాల్లో సైతం ఇరుక్కుంటుంది. ఇప్పటికే గతంలో రష్మిక మందన సౌత్ సినిమాలపై చేసిన కామెంట్లతో ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు కాంతారా సినిమా విషయంలో ఆమె మాట్లాడిన మాటలతో ఆమెపై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

కానీ అవి మాత్రం వాటిని అస్సలు పట్టించుకోదు. అయితే తాజాగా మరొక వివాదంలో చిక్కుకుంది మన నేషనల్ క్రష్ రష్మిక మందన. ఇకపోతే రష్మిక మందన చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తుంది. తాజాగా బర్గర్ యాడ్లో కూడా పాల్గొంది రష్మిక మందన. ఇక ఈ యాడ్లో ఆమె స్పైసి బర్గర్ ను రుచి చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఆ వీడియోను ఆమె తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఇందులో రష్మిక మందన చికెన్ బర్గర్ ను తింటూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంటుంది. అయితే గతంలో రష్మిక మందన తన శాఖహారిని అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.

కానీ ఇప్పుడు మాత్రం రష్మిక వందన చికెన్ బర్గర్ తినడంతో నటిజన్స్ రష్మిక మందన పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండాలి కానీ డబ్బులు కోసం అలవాట్లు మార్చుకుంటావా అంటూ రష్మిక మందను పై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నావా అంటూ రష్మిక మందనని కడిగిపారేస్తున్నారు నెటిజెన్స్. ఇక ఈ వివాదం మీద రష్మిక మందన స్పందిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: