టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను దర్శకుడుగా సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఆఖరుగా విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. 

మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది.  ఇలా లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం చెందడం తో పూరి జగన్నాథ్ ... విజయ్ దేవరకొండ తో స్టార్ట్ చేసిన జనగణమన మూవీ కూడా ఆగి పోయింది. దీనితో కొంత కాలం గ్యాప్ తీసుకున్న పూరి తాజాగా తన తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశాడు.

పూరీ తన తదుపరి మూవీ ని రామ్ పోతినేని తో చేయబోతున్నాడు. ఇది వరకే విరి కాంబినేషన్ లో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా వీరి కాంబినేషన్ లో డబల్ ఈస్మార్ట్ అనే మూవీ రూపొందబోతున్నట్లు ... ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 8 వ తేదీన తెలుగు , హిందీ , తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ప్రస్తుతం రామ్ ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: