యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ఆది పురుష్ చిత్రం జూన్ 16 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది మూవీ టీం.

ఈ చిత్రానికి కంటే కూడా ప్రభాస్ అభిమానుల నుండి ప్రేక్షకుల వరకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్.

ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ కి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ దొరికితే ఇక బాక్స్ ఆఫీస్ విధ్వసం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం ఎవరి తరం కాదు.ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నీ 10 రోజుల వ్యవధి లో లేచిపోతాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ కాంబినేషన్ కి ఉన్న పవర్ అలాంటిది మరి.రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.

అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశం ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ గా ఉండబోతుందట.ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ ఇంటర్వెల్ సన్నివేశాన్ని బీట్ చెయ్యడం అంటే సాధారణమైన విషయం కాదు.ఎందుకంటే ఆయన సినిమాల్లోని ఇంటర్వెల్ సన్నివేశాలు ఒకదానిని మించి ఒకటి ఉంటాయి.

ఛత్రపతి , రెబల్ ,మిర్చి మరియు బాహుబలి సిరీస్ లో ఇంటర్వెల్ సన్నివేశాలు ప్రభాస్ కెరీర్ లో మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే ది బెస్ట్ సన్నివేశాలు అని చెప్పొచ్చు.కేవలం ఈ సన్నివేశం కోసమే 35 కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట.

రీసెంట్ గానే ఈ సన్నివేశం చిత్రీకరణ పూర్తి అయ్యింది.దీంతో ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని అంటున్నారు, ఈ ఏడాది సెప్టెంబర్ 21 వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

రీసెంట్ గానే ఈ చిత్రం విడుదల తేదీ పై అభిమానుల్లో గందరగోళం ఎదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: