తమిళ స్టార్ హీరో తలపతి విజయ్  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస విజయాలతో టాప్ హీరోగా తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్న ఈ హీరోకు..తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన కొత్త ప్రాజెక్ట్స్ కోసం టాలీవుడ్ అడియన్స్ కూడా ఎదురుచూస్తుంటారు. ఇటీవలే వారసుడు సినిమాతో దక్షిణాది సినీ ప్రియులను అలరించిన విజయ్… ఇప్పుడు లియో సినిమాతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో విజయ్మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి మరోసారి జోడి కడుతున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై హైప్ క్రియేట్ చేసింది. ఓవైపు లియో షూటింగులో పాల్గోంటూనే.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు విజయ్.ఈ క్రమంలో ఆయన కొత్త మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.అక్కినేని నాగచైతన్య ఇంకా కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.


ఈ మూవీతో కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ హీరో విజయ్ తో ఉండబోతుందట. ఈ మూవీ కోసం విజయ్ కు ఏకంగా రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో ఇంత పెద్ద మొత్తంలో అత్యధిక పారితోషికం తీసుకునేది విజయ్  మాత్రమే. ఇంకా అంతకాకుండా.. సినిమా లాభాల్లో కూడా విజయ్ కు  షేర్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో దర్శకుడు వెంకట్ ప్రభు ఇంకా ప్రొడక్షన్ హౌస్ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామిగా ఉంటారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విజయ్ ఒక్క మూవీకి రూ. 100 కోట్లు పైగానే తీసుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ ఫాలోయింగ్ విజయ్ కు రూ. 150 కోట్లు ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: