వరుసగా కెరీర్ లో ఫ్లాప్స్ ఇచ్చిన ఏడాది గ్యాప్ ను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు యంగ్ హీరో నితిన్. అందుకే వెంటనే మరో సినిమా స్టార్ట్  పెట్టేశాడు. రీసెంట్‌గా భీష్మ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన నితిన్, మరో సినిమాను చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ప్రారంభించాడు. వెరైటీ కాన్సెప్ట్స్ తో మంచి సినిమాలను తీస్తాడన్న పేరుంది చంద్రశేఖర్ ఏలేటి కి. అందుకే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా కొత్త సినిమాను ప్రారంభించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనందప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా నిర్మితమవుతోంది. 


రకుల్ ప్రీత్, ప్రియాప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించబోతున్నారు. ప్రియా వారియర్ ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక ఈ అవకాశం దక్కించుకోవడానికి ప్రియకు నానా అవస్థలు పడిందట. చంద్రశేఖర్ ఏలేటి గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా విభిన్నంగా ఉండబోతోంది. అంతేకాదు సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందనే విషయాన్ని నితిన్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించబోతున్నాడు. 


భీష్మ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే, ఈ కొత్త సినిమా సెట్స్ పైకి రానుందని లేటెస్ట్ న్యూస్. శ్రీనివాస కల్యాణం సినిమా తర్వాత నితిన్ కెరీర్ లో దాదాపు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ ను ఇలా వరుస సినిమాలతో భర్తీ చేయాలని నితిన్ నిర్ణయించాడు. అంతేకాదు, ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉంటుండగానే తన సొంత బ్యానర్ పై కృష్ణచైతన్య దర్శకత్వంలో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడని మరో ఫ్రెష్ అప్డేట్. 



మరింత సమాచారం తెలుసుకోండి: