మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి రిలీజ్ కు రెడీ అయ్యింది. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ఇప్పటికే చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు.


ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఓకే చేశాడు. కమర్షియల్ సినిమాల్లో ఓ చిన్న పాటి సోషల్ మెసేజ్ ఇస్తున్న కొరటాల శివ మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లు అందుకున్నాడు. ఇక త్వరలోనే చిరు కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది.


ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తారని అంటున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ గా అనుష్క, శ్రద్ధా శ్రీనాథ్, హ్యూమా ఖురేషి వంటి భామల పేర్లు వినపడుతున్నాయి. సీనియర్ స్టార్ హీరోలకు హోరోయిన్స్ కష్టమవుతున్న ఈ తరుణంలో యంగ్ హీరోయిన్స్ వాళ్ల పక్కన నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా సీనియర్ హీరోయిన్స్ వైపే మొగ్గుచూపిస్తున్నారు హీరోలు. 


అందుకే చిరు కొరటాల శివ సినిమాకు త్రిషని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. 13 సంవత్సరాల క్రితం వచ్చిన స్టాలిన్ సినిమాలో త్రిష, చిరంజీవి కలిసి నటించారు. త్రిష అప్పటి ఫాంలో ఇప్పుడు లేకున్నా తమిళంలో వరుస సినిమాలు చేస్తుంది. అయితే సినిమాలో త్రిషతో పాటుగా మరో హీరోయిన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తాడని అంటున్నారు. డిసెంబర్ లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. మరి కొరటాల శివ చిరు ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: