ఈ మద్య తెలుగు లో మంచి అవకాశాలు రాని నటులు తమిళంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాంటి వారిలో సందీప్ కిషన్ ఒకరైతే ఈ మద్య నవీన్ చంద్ర కూడా వరుస ఛాన్సులు దక్కించుకుంటు్నాడు. ఆ మద్య ధనుష్ నటించిన పటాస్ తెలుగులో లోకల్ బాయ్ చిత్రం లో విలన్ గా నటించి మెప్పించాడు. అందాల రాక్షసి' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర, 'త్రిపుర' వంటి సినిమాలతో మరింత మంచి పేరు తెచ్చుకున్నాడు. నాని, కీర్తి సురేష్ నటించిన ‘నేను లోకల్’ లో నెగిటీవ్ షేడ్స్ తో కనిపించాడు. ఆ తర్వాత దేవదాస్ లో కూడా నెగిటీవ్ పాత్రలోనే కనిపించాడు. కెరీర్ కొనసాగించేందుకు తనకు వస్తున్న విలన్ ఆఫర్స్ ని సద్వినియోగం చేసుకోవాలని నవీన్ చంద్ర ఫిక్సయ్యాడట. ఈ నేపధ్యంలో వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న 'బాక్సర్' చిత్రంలో నవీన్ చంద్రను విలన్ గా తీసుకున్నారట. తాజాగా ఇప్పుడు నవీన్ చంద్రకు తమిళనాట మరో అద్భుతమైన అవకాశం వచ్చిందట. తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న 'వాలిమై' లో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీలో కార్తికేయ నటించడం నటించడం లేదని.. ఆయన స్థానంలో నవదీప్ ని తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
కానీ నవదీప్ ని కూడా తీసుకోలేదట. ఫైనల్ గా నవీన్ చంద్రను ఈ చిత్రం కోసం తీసుకున్నారని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ఫిక్స్ అయితే మాత్రం నవీన్ చంద్ర నక్కతోక తొక్కినట్టే అంటున్నారు. స్టార్ హీరోతో విలన్ గా నటించడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ చిత్రం హిట్ అయితే నవీన్ చంద్రకు మంచి పేరు వస్తుందని అంటున్నారు.