టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుని అంతకుముందు కెరీర్ పరంగా కొన్నాళ్ల నుండి సతమతమవుతున్న పవర్ స్టార్ కెరీర్ కు ఒక్కసారిగా పెద్ద బ్రేక్ ని అందించిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత నుండి పవన్ తో హరీష్ శంకర్ మరొక సినిమా చేయనున్నారు అంటూ వార్తలు వస్తున్నప్పటికీ కూడా అవి ఏ మాత్రం కార్యరూపం దాల్చలేదు.

ఇక ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వీరిద్దరి కాంబినేషన్లో ఫైనల్ గా ఒక సినిమాను సెట్ చేసింది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న పవర్ స్టార్, ఈ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ సినిమా చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో గ్రౌండ్ లెవల్ లో తెరకెక్కించనున్న ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే పవర్ఫుల్ స్టోరీ రెడీ చేసిన హరీష్ శంకర్ అందులో పవర్ స్టార్ పాత్రను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడట. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి స్టార్ క్యాస్టింగ్ కూడా భారీ స్థాయిలో ఉంటుందని ముఖ్యంగా పవర్ స్టార్ కు ఆపోజిట్ గా నిలిచే విలన్ పాత్రలో ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు నటించనున్నాడని, అలానే పలు ఇతర పాత్రల్లో కూడా పలువురు కోలీవుడ్, బాలీవుడ్ ముఖ్య నటులు నటించనున్నారని అంటున్నారు.

అలానే ఖర్చు పరంగా భారీ స్థాయిలో పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఎంతైనా పవర్ స్టార్ అంటే ఆయన క్రేజ్ కి ఇమేజ్ కి తగ్గట్టుగా ఆ మాత్రం రేంజ్ ఉండాలి కదా అని దీని గురించి పలువురు పవర్ స్టార్ అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: