కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగి పోయాయి. మళ్లీ నెమ్మదిగా ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా పైసా వసూల్ కాంబో లో మళ్లీ మరో సినిమా వస్తోంది అన్న విషయం  సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఏ హీరోతో సినిమా తీసిన అది హాట్ టాపిక్ గా మారుతుంది. దీనిలో సందేహం ఏమి లేదు.సినిమా  కనుక కన్‌ఫర్మ్ అయితే హీరో కంటే పూరి పేరే ఎక్కువగా ప్రచారం లో నిలుస్తుంది.



అలానే ఇప్పుడు  నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రానున్న  సినిమా షూటింగ్  కూడా  కరోనా కారణంగా నిలిచి పోయిన సంగతి తెలిసినదే. కానీ మళ్లీ ఈ  షూటింగ్ ని త్వరలో కొనసాగిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  2021 సమ్మర్ కి రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తరవాత నందమూరి బాలకృష్ణసినిమా లో నటిస్తాడనేది ప్రశ్నార్ధకమే.  బాలయ్య బాబు  కోసం కథ సిద్దం చేసుకొని రెడీగా ఉన్నట్టు మాత్రం వార్తలు వస్తున్న సంగతి తెలిసందే.

మరి  బాలయ్య నెక్స్ట్ సినిమా పూరి జగన్నధ్ దర్శకత్వంలో చేయచ్చు అని టాక్. పూరి ప్రస్తుతం  విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసినదే. ఇది పూర్తి అయ్యాక సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేలా పూరి పక్కాగా ప్లాన్ చేసుకొని ఉన్నాడట. మంచి టాక్ వచ్చినప్పటికి పైసా మాత్రం వసూల్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం పూరి బాలయ్య కోసం ఫుల్ ఎనర్జీ తో ఉన్న కథ ను సిద్దం చేశాడని సమాచారం. మరి ఈ సినిమాని మనం చూడాలంటె ఈ సమ్మర్ వరకు ఆగక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: