తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తనదైన శైలిలో సినిమాలో నటిస్తూ మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇపుడు హీరోలతో పాటు వాళ్ల పిల్లలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. నాలుగేళ్ళ వయసులోనే ఈ చిన్నారి అద్భుతాలు చేస్తుంది. ముఖ్యంగా తన బుజ్జి బుజ్జి మాటలతో అందర్నీ ఫిదా చేస్తుంది అర్హ.

అయితే కొడుకు అయాన్ కంటే కూడా అర్హనే సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అయాన్ కూడా అప్పుడప్పుడూ కనిపిస్తాడు కానీ చెల్లి కంటే పర్ఫెక్ట్ మాత్రం కాదు. ఇప్పుడు కూడా ఇదే చేసింది అర్హ. తనకు ఎప్పుడు టైమ్ దొరికినా కూడా వెంటనే కుటుంబంతో కాలం గడిపేస్తుంటాడు అల్లు అర్జున్. పైగా లాక్‌డౌన్ సమయంలో వాళ్లతో మరింత కనెక్ట్ అయిపోయాడు బన్నీ. హాయిగా వాళ్ల‌తోనే టైమ్ స్పెండ్ చేసాడు. ఇప్పుడు కూడా బ‌న్నీ త‌న కూతురు అర్హతో ఆడుకుంటున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఇక అల్లు అర్జున్ షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్న.. కాస్త గ్యాప్ దొరికితే చాలు కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తున్నాడు. ఈ మధ్యనే పుష్ప సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో బన్ని కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఈ సమయంలో అల్లు అర్జున్ .. తన పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. అంతేకాదు ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు వెళ్లాడు.

అయితే అక్కడ ఫేమస్ థీమ్ పార్క్‌‌ను అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సందర్శించాడు. అక్కడ కూతురుతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దుబాయ్‌లోని చిల్డ్రన్స్ ప్లే మ్యూజియం గ్యాలరీతో తీసిన వీడియో ఇది. ప్రస్తుతం అల్లు అర్జున్ .. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: