ప్రముఖ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ పవర్ స్టార్ నుంచి విడిపోయిన కాని పవన్ అభిమానులు ఈమెని ఆదరిస్తూనే వుంటారు.ఇక రేణు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా వుంటున్నారు.ఈమె ఎప్పటికప్పుడు సామాజిక, రాజకీయ అంశాల గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వుంటారు. ఇక తాజాగా తన మాజీ భర్త, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమెకి ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడితే.. కొందరు దాన్ని నెగెటివ్ గా క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మొన్నామధ్య కూడా ఒక విషయంలో పవన్ అభిమానులు ఈమెను ట్రోల్ కూడా చేశారు.


ఇక తన కూతురు ఆద్యతో కలిసి ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన రేణుదేశాయ్.. కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఎంతో అవసరమైతే తప్ప బయటకి వెళ్లొద్దని కోరారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ 'అకీరా సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్ గా ఉండరని' ప్రశ్నించాడు. దానికి ఆమె.. అకీరాకి పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో అకౌంట్స్ ఉన్నాయని.. అదంతా ప్రైవేట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. కేవలం తన స్నేహితులు మాత్రం అకీరాను ఫాలో అవుతుంటారని వెల్లడించారు.తన ఆన్ లైన్ ఖాతాలను పబ్లిక్ చేయడం అకీరాకు ఇష్టం లేదని తెలిపారు. మరో నెటిజన్ 'పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా మాట్లాడగలరా..?' అని కోరగా.. 'ఆయన గురించి ఏం మాట్లాడమంటారు..? నా లైవ్ కి వచ్చి కూడా ఆయన గురించే మెసేజ్ లు పెడతారు. ఒకవేళ నేను స్పందిస్తే.. రేణుకి ఏం పని లేదు.. ఎప్పుడూ ఆయన గురించే మాట్లాడుతుందని మళ్లీ నన్నే తిడతారు' అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై సంచలన కామెంట్స్ చేసి అసహనం వ్యక్తం చేసింది రేణు దేశాయ్..

మరింత సమాచారం తెలుసుకోండి: