ఈ ఏడాది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. కరోనా కారణంగా ఆయన తదుపరి చిత్రాల షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఇప్పటికే పవన్
దగ్గుబాటి రానాతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ చెయ్యడానికి ఒప్పుకున్నారు. క్రిష్ జాగర్లమూడితో కలిసి ‘హరిహర వీరమల్లు' అనే పీరియాడికల్ డ్రామా కూడా చేస్తున్నారు. ఈ సినిమాకి ఏఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ
సినిమా కోసం మెగాసూర్య ప్రొడక్షన్ కంపెనీ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుందని తెలుస్తోంది. ఈ 2 సినిమాలను మినహాయించి పవన్ మరి కొన్ని సినిమాలను కూడా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుత సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..
పవన్ కల్యాణ్,
పూరి జగన్నాథ్ తో కలిసి ఒక
సినిమా చేయాలని భావిస్తున్నారట.
పవన్ కల్యాణ్,
పూరి జగన్నాథ్ కాంబోలో ‘బద్రీ'
సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ
సినిమా పవన్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈ
సినిమా తర్వాత వీళ్లిద్దరూ కలిసి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'
మూవీ చేశారు కానీ అది ఆశించినంత స్థాయిలో ఆడలేదు. ఐతే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పవన్ కల్యాణ్,
పూరి జగన్నాథ్ కాంబో రిపీట్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ
పవన్ కల్యాణ్ పూరీ తో కలిసి
సినిమా చేసేందుకు పూర్తి స్థాయిలో సిగ్నల్ ఇస్తే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబోలో ‘పోకిరి', ‘బిజినెస్మ్యాన్' సినిమాలు వచ్చి
బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల తర్వాత మహేష్-పూరీ కాంబోలో ‘జనగణమన' పేరుతో ఒక
సినిమా వస్తుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ వారిద్దరి మధ్య కాస్త దూరం పెరగడంతో ఇప్పటికీ ఆ
సినిమా త్వరగా లేదు. అయితే అదే కథను పూరీ జగన్నాథ్ పవన్
సినిమా కోసం వాడనున్నారని సమాచారం.