తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి ప్రస్తుతం ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా హీటిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే అయితే రాజమౌళి తాను చేసిన సినిమాల్లో అడపాదడపా అతిధి పాత్రలో నటిస్తూ మెప్పిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆయన సై సినిమాలో నటించి ప్రేక్షకులకు కనిపించిన సన్నివేశం గురించి. నితిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సుమారు 14 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించగా విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు అలాగే రత్నం డైలాగ్స్ అందించారు. 


ఎవరికీ తెలియని ఒక రగ్బీ అనే ఆటను తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారానే రాజమౌళి పరిచయం చేశారు. ముఖ్యంగా నితిన్ జెనీలియా మధ్య కెమిస్ట్రీ అలాగే కాలేజీలో ఫన్నీ సీన్స్ భిక్షు యాదవ్ గా ప్రదీప్ రావత్ నటించిన నటన ఈ సినిమాకి మంచి అసెట్స్ గా నిలిచాయి. ఆ రోజుల్లో ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ సినిమా సుమారు 13 కోట్ల రూపాయలు వసూలు సాధించి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో కొన్ని సెకన్ల సీన్ లో రాజమౌళి కనిపిస్తాడు. కానీ మనం అంతగా గుర్తుంచుకునే క్యారెక్టర్ అయితే కాదు. 

అది ఏ సీన్ అంటే ఈ సినిమాలో నల్ల బాలు నటించిన వేణుమాధవ్ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లను గోడమీద రాయించే కాంట్రాక్టర్ పాత్ర పోషించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అలా ఆయన కాలేజీ గోడమీద రాస్తున్న సమయంలో రాజమౌళి అటుగా వెళ్తుంటే ఆయనను పట్టుకుని వేణుమాధవ్ టీజ్ చేస్తాడు. అప్పుడు గుర్తు పట్టడం కష్టమే కానీ ఇప్పుడు మళ్లీ మీరు సినిమా పెట్టుకుని చూస్తే ఆ విషయాన్ని గమనించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: