దేశంలో కరోనా వైరస్ ఏ రేంజ్ లో  విస్తరిస్తుందో అందరికీ తెలిసిందే. మొదటి దశ, రెండవ దశ అంటూ దశలుగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కరోనా వైరస్ ఉధృత రూపాన్ని దాల్చుతుంది. ఇప్పుడు రెండవ దశ  తగ్గింది అన్నట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యకలాపాలు తెరుచుకున్నాయి. మళ్లీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే మూడవ దశ ప్రమాదం పొంచి ఉందని వార్తలు వినిపిస్తుండడంతో ప్రజల్లో కొత్తరకం భయాందోళనలు మొదలయ్యాయి. అయితే ప్రజల ఇబ్బందులను గమనించి చాలా మంది ప్రముఖులు వారికి తమదైన సేవ చేయడానికి ముందుకు వచ్చారు.

మహమ్మారి కి వ్యతిరేకంగా సాగుతున్న పోరులో ఎంతోమంది పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే సోనూసూద్ విజయ్ దేవరకొండ లాంటివాళ్ళు దేశవ్యాప్తంగా అనేక రకాలుగా సాయం చేస్తూ రియల్ హీరోలు అనిపించుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఆక్సిజన్ సిలిండర్ల సెంటర్ ను ఓపెన్ చేసి తన బాధ్యతను నెరవేర్చారు. అంతేకాకుండా వివిధ రకాలుగా సినీ ఇండస్ట్రీలోని కార్మికులను, రాష్ట్రంలోని ప్రజలకు ఆయన ఆదుకున్నారు. ఆయన బాటలోనే  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేస్తున్న సాయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

అమితాబ్బచ్చన్ చేస్తున్న సేవలకు కూడా బ్రేక్ అనేది లేదని చెప్పాలి. కరోనా పోరులో భాగంగా గతంలో సుమారు 15 కోట్ల వరకు విరాళం ఇచ్చారు అమితాబ్. ఢిల్లీలోని కోవిడ్ సెంటర్ కు రెండు కోట్ల సాయం చేసిన. ఆయన  25 నుంచి 50 బెడ్ల వరకు కోవిద్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇచ్చారు.   అలాగే ముంబైలోని ఆసుపత్రికి ఖరీదైనా ఎన్ఆర్ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్ పరికరాలు సమకూర్చారు. రీసెంట్ గా 2 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు వైద్య పరికరాలను ముంబైలోని సియన్ లో గల లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి అందజేశారు . ఇప్పటివరకు ఆయన చేసిన సహాయాలను డబ్బు రూపంలో లెక్క కడితే సుమారు 20 కోట్లు దాటి ఉంటుందని అంచనా. 

మరింత సమాచారం తెలుసుకోండి: