టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త రక్తం ఎక్కుతోంది కొత్త కొత్త హీరోలు టాలెంటెడ్ హీరోలు సినిమాలు చేస్తూ
టాలీవుడ్ లో కొత్త దనం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా వారు తమ టాలెంట్ ను నిరూపించుకోని హీరోలుగా ఎదుగుతూ రేపటి తరానికి స్టార్లుగా సంకేతాలు ఇస్తున్నారు. ఆ విధంగా
సంతోష్ శోభన్,
నవీన్ పోలిశెట్టి,
తేజ సజ్జ లాంటి వారు ఇప్పటికే తమ తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు.
నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ కొట్టి స్టార్
హీరో అయ్యేందుకు రెడీగా ఉన్నాడు. మరోవైపు
సంతోష్ శోభన్ కూడా ఇటీవలే ఏక్
మినీ కథ అనే సినిమాతో హిట్ అందుకొని క్రేజీ హీరోగా మారిపోయాడు.
ఇకపోతే బాల నటుడిగా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు
తేజ సజ్జ కూడా హీరోగా పరిచయమై వరుస హిట్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే జాంబీ
రెడ్డి అనే విభిన్నమైన సినిమాలో హీరోగా చేశాడు. ప్రస్తుతం హనుమాన్ అనే
ఇండియన్ సూపర్
హీరో చిత్రాన్ని చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ ప్రేమకథా చిత్రంలో కూడా ఆయన హీరోగా నటిస్తున్నాడు. ఇలా
తేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వీరు ముగ్గురు కాకుండా
కిరణ్ అబ్బవరం అనే మరో
హీరో కూడా వరుస
సినిమా లు చేసుకుంటూ ప్రేక్షకుల కళ్ళల్లో పడడానికి ట్రై చేస్తున్నాడు.
ఇలా స్టార్ హీరోలకు సైతం ఈ
యువ హీరోలు పోటీగా వస్తున్న నేపథ్యంలో
హీరో సంతోష్ శోభన్ చాలా తక్కువ టైమ్ లోనే మారుతితో సినిమాలో నటించి రికార్డు సృష్టిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాబోతున్న ట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలోనే ఈ
సినిమా షూటింగ్ ప్లాన్ చేసి పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. దీనిని ఓ టీ టీ లో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారట.
సంతోష్ ఇప్పటికే తన ఏక్ మిని కథ సినిమాను విడుదల చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు
మారుతి దర్శకత్వంలో చేసిన ఈ
సినిమా కూడా ఓ టీ టీ లోనే విడుదల చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ
హీరో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. భవిష్యత్తులో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.