మొదట షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన ప్రతిభకు పదును పెట్టిన దర్శకుడు సందీప్ రాజ్. కలర్ ఫోటో చిత్రంతో డైరెక్టర్ గా తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే సక్సెఫుల్ డైరెక్టర్ గా అందరి ప్రశంసలను అందుకున్నారు. విమర్శకుల మెప్పును కూడా పొంది తన టాలెంట్ ను నిరూపించుకున్నారు సందీప్. డైరెక్టర్ మారుతి, రాజమౌళి, ర‌వితేజ‌, ఇలా ఇండ‌స్ట్రీకి చెందిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సోష‌ల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపి దర్శకుడు సందీప్ ను ప్రశంసించారు. హీరో నాని అయితే స్వయంగా ఫోన్ చేసి మరీ సినిమా బాగా తీశావంటూ అభినందించారు అని ఓ మీడియా సమావేశంలో తెలిపారు డైరెక్టర్ సందీప్. ఇలా స్టార్ లతో ప్రశంసలు పొందడం అంటే చిన్న విషయమేమీ కాదు...కంటెంట్ లేనిదే క్రెడిట్ రాదు.
అయితే ఈ టాలెంటెడ్ దర్శకుడికి అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు నుండి పిలుపు వచ్చినట్లు సమాచారం. ప్రతిభావంతులైన యువ దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు ఇపుడు సందీప్ రాజ్ కు అవకాశం ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. స్వయంగా నిర్మాత సురేష్ బాబు.. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ కు పర్సనల్ గా ఫోన్ చేసి మరీ నీతో ప్రాజెక్ట్ చేస్తాను మంచి కథ రెడీ చేసుకో అని అన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

 ఒకవేళ ఇది నిజమే అయితే ఈసారి సందీప్ ఎటువంటి విభిన్న కాన్సెప్ట్ తో మనముందుకు వస్తారో చూడాలి. అది కాక కథ నచ్చితే ఆ సినిమాలో హీరో రానా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి సందీప్ రాజ్ దీనిపై ఇంకా ఏమీ స్పందించలేదని తెలుస్తోంది. ఒకేసారి కథ రెడీ చేసుకుని వెళ్లి అధికారిక వార్త చెబుతారేమో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
  

మరింత సమాచారం తెలుసుకోండి: