బుల్లితెరపై సత్తా చాటి వెండి తెరపై ఎంట్రో ఇవ్వబోతున్న భామ అరియానా. ఈమె యాంకర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో పార్టిసిపేట్ చేసింది. ఇక అక్కడ తన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఆమె ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందట. నిజంగానే ఆమె ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందా? అసలేం జరిగింది?

బిగ్ బాస్ రియాలిటీ షో లో పార్టిసిపేషన్ తర్వాత అరియానా ఫేమ్ ఆటోమేటిక్‌గా పెరిగిపోయింది. వివాదాలకు కేరాఫ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఆమె ఇంటర్వ్యూ చేయడం కూడా ఆమెను మరింత మంది అభిమానించేలా చేసిందని చెప్పొచ్చు. యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలో కీ రోల్ ప్లే చేయబోతున్న ఈ భామ. మెగాస్టార్ చిరు అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రంలో‌నూ కీ రోల్ ప్లే చేస్తోంది.  ఈ క్రమంలో వెంటిలేటర్‌పై ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది అరియానా.

అది చూసి ఆమె అభిమానులు నిజంగానే వెంటిలేటర్ పైకి వెళ్లిందా? అని షాక్‌కు గురవుతున్నారు. అయితే, అది నిజం కాదండోయ్. కల్యాణ్ దేవ్‌తో నటిస్తున్న చిత్రంలో భాగంగా ఓ సీన్‌లో వెంటిలేటర్‌పై ఉన్న ఫొటో అది.  షూటింగ్ స్పాట్‌లోని  ఈ ఫొటోను షేర్ చేసింది అరియానా. కాగా, ఈ ఫొటో చూసి ఆర్జీవీ ఎలా స్పందిస్తాడో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆర్జీవీతో అరియానా చేసిన బోల్డ్ ఇంటర్వ్యూకు బోలెడన్నీ లైక్స్ , కామెంట్స్ వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే అరియానా తన ఇన్ స్టా అకౌంట్ అరియానా గ్లోరీ ద్వారా ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది.

సోషల్ మీడియా క్వీన్ అరియానా అంటూ పలువురు నెటిజన్లు అప్పుడప్పుడు పోస్టులు పెడుతుండటం మనం గమనించొచ్చు. ఈ క్రమంలోనే వెంటిలేటర్‌పై ఉన్నట్లు అరియానా పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరలవుతోంది. అరియానా అభిమానులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కొవిడ్ వంటి పాండమిక్ టైంలో పలువురు సెలబ్రిటీలు, సామాన్యులు ప్రాణాపాయ స్థితుల్లోకి వెళ్లి మరణించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో అరియానా వెంటిలేటర్‌పై ఉన్న ఫొటో చూసి నెటిజనాలు షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: