సూపర్ స్టార్ మహేష్, అందాల కథానాయిక కీర్తి సురేష్ ల ఫస్ట్ కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థల పై ఎంతో భారీ ఎత్తున నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుబ్బరాజు, సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మది ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

మంచి మెసేజ్ తో కూడిన భారీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తున్నట్లు ఇన్నర్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాపై అటు మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా నుండి మరొక గంట లో అనగా సరిగ్గా 6 గం. 03 ని. లకు ఒక పెద్ద అప్ డేట్ రాబోతోంది అంటూ కొద్దిక్షణాల క్రితం యూనిట్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటించింది. దీనితో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ అప్ డేట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి సర్కారు వారి పాట యూనిట్ నుండి ఎటువంటి సర్ప్రైజింగ్ అప్ డేట్ వస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. మరి రేపు విడుదల తరువాత ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో, ఎంత రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: