పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా మూడు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ముందుగా ఏకే రీమేక్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రానా మరో కథానాయికగా నటిస్తుండగా నిత్యామీనన్ ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్ లు నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమాల్లు సినిమా కూడా చేస్తున్నాడు.

సినిమా దాదాపు సగం వరకు షూటింగ్ పూర్తి చేయగా త్వరలోనే మిగితా షూటింగ్ పూర్తి చేయనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమా కు సంబందించిన మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా సినిమా పై మంచి అంచనాలను పెంచింది. హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంపిక అయ్యింది.  ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా పవన్ కెరీర్ లో మంచి సినిమా గా మిగిలిపోతుందని అంటున్నారు. మాస్ చిత్రం గా రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఇప్పటినుంచే మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా  టీవీలో రాగా టీవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది ఈ సినిమా. టిఆర్పి రేటింగ్ గమనిస్తే దీనికి ఎలాంటి స్పందన వచ్చింది అనేది అర్థం చేసుకోవ చ్చు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా టీవీలో వస్తే భారీ రేటింగ్ లు రావడం సహజం కానీ ఈ సినిమా రేటింగ్ మాత్రం అభిమానులను నిరాశ పరుస్తుంది. కేవలం 19 రేటింగ్ తో సరిపెట్టుకుంది. కానీ మహేష్ బా బు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎన్ని సార్లు టెలికాస్ట్ అయిన కూడా భారీ టీ ఆర్ పీ సంపాదించుకోవడం తో పవన్  సినిమా లకు క్రేజ్  తగ్గిందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: