. వారిలో నిరాశ నిస్పృహలు తొలగించడానికి వారందరిని తిరిగి అలరించడానికి మళ్ళీ ముందుకు వచ్చారు ఎన్టీఆర్. బుల్లితెర రంగంలో మొదట బిగ్ బాస్ షో తో మొదలు పెట్టి తనదైన టాలెంట్ తో ఆ షో మంచి విజయం సాధించేలా చేసారు. అదే ఉత్సాహంతో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ జెమినీ టీవీ తరపున ఒక షో చేసాడు. ఈ షో కర్టన్ రైజర్ నేడు ప్రసారమైంది. ఈ షో కు గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాంచరణ్ రావడంతో ఈ షోకు మరింత ఆకర్షణ వచ్చిందని సమాచారం. ఎన్టీఆర్ రాంచరణ్ లు కలిసి ఒకే షో లో కనిపించడంతో వారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న rrr చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని తెగ వెయిట్ చేస్తున్న వీరి అభిమానులకు ఈ షో కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ షో లో రాంచరణ్ తన వ్యక్తిగత విషయాలు ఎన్నో పంచుకున్నాడని సమాచారం. అంతే కాదు ఈ షో లో గెలిచినా తన తండ్రి స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేస్తాను అని చెప్పాడని సమాచారం. అంతే కాకుండా ఎన్టీఆర్ కోసం ఆరంజ్ చిత్రంలో సిడ్ని నగరమే చేసే నేరమే అంటూ మంచి పాట పాడి ప్రేక్షకులను బాగా అలరించినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి