ఇటీవల విడుదలైన జేమ్స్ బాండ్ సిరీస్లో డేనియల్ క్రెగ్ హీరోగా ‘నో టైం టు డై’ టైటిల్తో సినిమా విడుదలైంది. ఈ సినిమాను మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో.. దాదాపు రూ.2,000 కోట్ల బడ్జెట్తో సినిమాను రూపొందించారు. దర్శకుడిగా జోజీ ఫకునగా.. ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను చిత్రీకరించారు. వరల్డ్స్ మోస్ట్ అవెయిట్ మూవీ ‘నో టైం టు డై’ సినిమా పోయిన ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా భారీ వసూళ్లనే కొల్లగొట్టింది.
ఇప్పటివరకు దాదాపు 100 మిలియన్లకు పైగా కలెక్షను సాధించిన ఈ సినిమా ప్రస్తుతం.. ఆస్కార్ బరిలో నిలిచింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధికారికంగా వెల్లడించింది. 94 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందజేస్తుండగా.. ప్రస్తుతం దాన్ని 10కి కుదించినట్లు పేర్కొంది. ఇందులోని 4 విభాగాల్లో జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైం టు డై’ సినిమాను ఎంపిక చేశారు. ఆస్కార్ బరిలో 10 కేటగిరీల్లో 4 కేటగిరీలు ఒకే సినిమాకు రావడం విశేషం. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్ – మూవీ టైటిల్ సాంగ్), సౌండ్ ఇలా 4 కేటగిరీలు ఎంపిక చేశారు. ఇందులో జేమ్స్ బాండ్ మూవీ ఎన్ని కేటగిరీలు సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి