పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా రానా తో కలిసి చేసిన భీమ్లా నాయక్ మూవీ ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం కి రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ లో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించగా సాగర్ కె చంద్ర దీనిని తెరకెక్కించారు .ఇక ప్రస్తుతం క్రిష్ తో హరిహర వీరమల్లు అనే భారీ పీరియాడికల్ డ్రామా మూవీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఏ ఎం రత్నం మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకోగా, దీనిని ఈ ఏడాది దసరా కి రిలీజ్ చేయనున్నట్లు టాక్. అయితే దీని అనంతరం గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయనున్నారు పవన్ కళ్యాణ్. చాలా ఏళ్ళ విరామం తరువాత తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మూవీ కావడంతో దర్శకుడు హరీష్ శంకర్మూవీ స్క్రిప్ట్ ని ఎంతో అద్భుతంగా రాసుకున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లెక్చరర్ గా ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారట. అలానే పక్కాగా సాగె మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారని, త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు టాక్. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రేపు రిలీజ్ తరువాత భవదీయుడు భగత్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో షేక్ ఆడించడం చాలా వరకు ఖాయంగా కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: