పైన చూస్తున్న ఫోటోలో అతిలోకసుందరి తో పాటు మరో ముగ్గురు అందమైన పిల్లలు ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఈ ముగ్గురు పిల్లలు కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్లే.. అయితే ఒకప్పుడు దక్షిణాది తో పాటు ఉత్తరాదిని కూడా ఈ ముగ్గురు ఏలేసారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ ముగ్గురూ కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేయడం జరిగింది. అంతేకాదు వీరు ముగ్గురు కూడా సొంత అక్క చెల్లెలు కావడం గమనార్హం. బహుశా వారెవరో మీకు ఇప్పటికే గుర్తుకు వచ్చి ఉండి ఉంటుంది.. కదా..అవును మీరు అనుకున్నది నిజమే.. వారెవరో కాదు నగ్మా ,జ్యోతిక, రాధిక (రోషిణి).

నగ్మా తన 50 సంవత్సరాల  వయసుకు చేరువవుతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఇక ఈమె ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. తన అంద చందాలతో తెలుగులో స్టార్ హీరోలు అందరితో కూడా కలసి నటించి మెప్పించింది. ఇక ఎన్నో ఊర మాస్ పాత్రలు కూడా చేసింది. నిజానికి అప్పట్లో నగ్మా కు అరేబియన్ గుర్రం అనే పేరు కూడా ఉండేది. ఆమె నటన , ఆమె స్టైల్ అబ్బో ఓ రేంజ్ లో ఉండే అని చెప్పవచ్చు. ఇక అంతే కాదు సీనియర్ హీరో శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత భోజ్ పురి లో కూడా బీజేపీ ఎంపీలు మనోజ్ తివారి,  రవి కిషన్ సింగ్ తో కూడా ప్రేమ కథ నడిపింది. ఇక ప్రముఖ క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ లతో కూడా ప్రేమాయణం నడిపింది. ఇక అతనితో కూడా బ్రేకప్ అయిన తర్వాత కాంగ్రెస్ లో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా.. ఈమెను రాజ్యసభకు పంపిస్తానని సోనియా హామీ ఇచ్చినా నెరవేర్చలేదు అంటూ వాపోయింది. ఏదిఏమైనా ఈమె మాత్రం తన వైవాహిక జీవితానికి దూరంగా ఉంది అని చెప్పవచ్చు.ఇక జ్యోతిక విషయానికి వస్తే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వీరికి పిల్లలు పుట్టాక కూడా సినిమాలు చేస్తూ కావలసినంత కీర్తి, డబ్బు తో పాటు ఒక అందమైన జీవితాన్ని కూడా సొంతం చేసుకుంది.

ఇక రాధిక అలియాస్ రోషిణి విషయానికి వస్తే.. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలు చేసిన ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత  వివాహం చేసుకొని అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయింది . పిల్లలు , భర్తతో హ్యాపీగా జీవిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: