టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు డైలాగ్స్ స్క్రీన్ ప్లే బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన రీమేక్ మూవీ `భీమ్లా నాయక్`కు కూడా డైలాగ్స్ స్క్రీన్ ప్లే బాధ్యతల్ని నిర్వర్తించారు. ఆ పరంగా త్రివిక్రమ్ భారీగానే పారితోషికం తీసుకున్నారట.తాజాగా పవన్ కల్యాణ్ మరో రీమేక్ కు కూడా సైలెంట్ గా శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక ఇది తమిళంలో నటుడు సముద్రఖని నటించి తెరకెక్కించిన మూవీ `వినోదాయ సితం`. ఈ మూవీని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేస్తుండగా కీలక పాత్రలో మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నారు. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. అయితే పేరుకి ఆయన డైరెక్టర్ కాదన్నమాటే కానీ పెత్తనం మొత్తం కూడా ఆయనదే అని తెలుస్తోంది.గతంలో పవన్ కళ్యాణ్ నటించిన `తీన్ మార్` మూవీకి జయంత్ సి. పరాన్జీ డైరెక్టర్ అయినా త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించి డామినేట్ చేశాడు.


ఇటీవల `భీమ్లానాయక్` సినిమాకు కూడా ఇదే తరహాలో వ్యవహరించడం తో దర్శకుడు సాగర్ చంద్ర కు పెద్దగా క్రెడిట్ దక్కలేదు. ఇక ఇప్పడు తమిళ రీమేక్ సినిమా `వినోదాయ సితం`కు కూడా త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్ కు భారీ మార్పులు చేసిన త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా తనదే పై చేయిగా వ్యవహరిస్తున్నారట.ఇప్పటికే `భీమ్లానాయక్`సినిమాతో డైరెక్టర్ ఎవరైనా డామినేషన్ మొత్తం కూడా త్రివిక్రమ్ దే అనే కామెంట్ లు కూడా వినిపించాయి. తాజాగా `వినోదాయ సితం` సినిమా రీమేక్ కూడా ఇప్పడు ఇదే కామెంట్ లు మొదలయ్యాయట. మరి సముద్రఖని ఈ డామినేషన్ ని తట్టుకుని ఎలా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాడో అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.అయితే త్రివిక్రమ్ లేకపోతే పవన్ కళ్యాణ్ హిట్ కొట్టడం కష్టమేనా అన్న కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: