రాజకీయాల్లో సెంటిమెంట్ పాత్ర ఎంత బలంగా పనిచేస్తుందో అన్నది ఎన్నడూ తగ్గని చర్చ. ఒక నాయకుడు సమావేశం ఏర్పాటు చేసే సమయం నుంచి, నామినేషన్ దాఖలు చేసే రోజునుంచి, ప్రమాణ స్వీకారం వరకు ప్రతి దాంట్లో శుభముహూర్తాలు, భావోద్వేగాలు, నమ్మకాలే కీలక పాత్ర పోషిస్తాయి. భారత రాజకీయం మొత్తంలోనే సెంటిమెంట్ ఓటింగ్‌కు ప్రభావం ఉందనేది స్పష్టమైన నిజం. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలోని నరసన్నపేట నియోజకవర్గంలో కూడా ఇలాంటి సెంటిమెంటే ప‌ని చేస్తోంది. ఈ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికలుగా సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతోంది. ఇక్క‌డ వరుసగా ఎవ్వరూ రెండోసారి గెలవడం లేదు. ఒక్కసారి ఓ నాయ‌కుడిని ప్ర‌జ‌లు ఎన్నుకుంటే త‌ర్వాత వారిని ప్ర‌జ‌లు మార్చేస్తున్నారు. 2014లో టీడీపీ తరఫున భ‌గ్గు రమణమూర్తి విజయం సాధించారు. ఆయనకు మంచి ఇమేజ్, స్థానిక అభివృద్ధి పట్ల కృషి, ప్రజల్లో బలమైన పాపులారిటీ ఉన్నా 2019 ఎన్నికలో ప్రజలు వేరే నిర్ణయం తీసుకున్నారు.


ఆ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీఆర్‌సీపీ హవా నరసన్నపేటకు కూడా చేరింది. అందువల్ల ధర్మాన కృష్ణదాస్ గెలుపొందారు మరియు తరువాత జ‌గ‌న్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2024 ఎన్నికలకు రాగానే ప్రజలు మళ్లీ మార్పు కోరుకున్నారు. ఈ సారి కూటమి ప్రభావం, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన రాజకీయ వాతావరణం కారణంగా మళ్లీ బగ్గు రమణమూర్తికి గెలుపు ప‌ట్టం క‌ట్టారు. ఇలా మూడుసార్లు ఇక్క‌డ ఎవ్వ‌రిని వ‌రుస‌గా రెండోసారి గెల‌వ‌నీయ‌లేదు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది మ‌ళ్లీ ఆస‌క్తిగా మారింది.


2014లో చంద్ర‌బాబు హ‌వా, 2019లో జ‌గ‌న్ హ‌వా, 2024లో కూట‌మి హ‌వాల నేప‌థ్యంలో ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన అభ్య‌ర్థుల‌నే గెలిపించారు. ఈ క్ర‌మంలోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ రాష్ట్రంలో ఏ పార్టీకి గాలి వీస్తే ఆ పార్టీ అభ్య‌ర్థినే ఇక్క‌డ గెలిపించే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఆ సారి టీడీపీ, వైసీపీల‌లో వార‌సులు కూడా ఇక్క‌డ పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ సారి కూడా ఇక్క‌డ కొత్త వారే ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్సులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: