టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్రియేటివ్ దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణవంశీ ఇప్పుడు మరొక వెరైటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఇతర దర్శకులతో పోలిస్తే కాస్త వెనుకబడి ఉన్న ఈ దర్శకుడు ఇప్పుడు మంచి కం బ్యాక్ చేయాలని భావిస్తున్నాడు. ఆ విధంగా గులాబీ చిత్రంతో దర్శకుడుగా అరంగేట్రం చేసి తనదైన మార్కును ప్రేక్షకులకు రుచి చూపించిన ఈ దర్శకుడు ఇప్పుడు అలాంటి తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

నిన్నే పెళ్ళాడుతా, సింధూరం , మురారి, ఖడ్గం అంతపురం వంటి చిత్రాలతో తెలుగు సినిమా పరిశ్రమ పోకడను పూర్తిగా మార్చివేసిన కృష్ణవంశీ మహాత్మ సినిమా దగ్గరనుంచి ప్రేక్షకులను ఆ స్థాయి లో అలరించలేకపోయాడు. ట్రెండ్ కి తగ్గట్లు గా అప్డేట్ అవలేదని ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలను బట్టి తెలుస్తుంది. సున్నితమైన కుటుంబ బాగోద్వేగాల సమాహారంగా తన సినిమాలను చేస్తూ వచ్చిన ఆయన పదేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు అంటే ఆయన ఏ స్థాయిలో ప్రేక్షకులను నిరాశపరిచాడో అర్థం చేసుకోవచ్చు.

అలా రంగమార్తాండ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన ఆయన త్వరలోనే ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ కొన్ని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమా గురించి మరిన్ని విశేషాలు వెల్లడించారు. ఆయన హిట్టు కొట్టడం కోసం సినిమాలు చేయనని ప్రేక్షకులకు నచ్చాలని ఉద్దేశంతోనే సినిమాలు చేస్తానని వెల్లడించారు. నిజంగా ఆయన సినిమాలు  చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. త్వరలోనే ఆయన 300 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: