అంతేకాదండోయ్ నిజం లాంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలో కూడా నటించి తన నటనతో మెప్పించింది. అయితే ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించ గలిగిన రాసి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం సినిమాను మాత్రం రిజెక్ట్ చేసిందట. ఇంతకీ రంగస్థలం లో రాసి రిజెక్ట్ చేసిన పాత్ర ఏదో కాదు జబర్దస్త్ యాంకర్ అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర. ముందుగా ఈ పాత్ర కోసం రాసిని అనుకున్నారట దర్శకుడు సుకుమార్.
అయితే ఈ పాత్రలో మోకాళ్లపైకి చీర కట్టుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు మందు తాగే సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుంది. అయితే కథ రాసికి నచ్చినప్పటికీ ఇక తన పాత్రలో ఉన్న కొన్ని సీన్స్ మాత్రం ఆమెకు నచ్చలేదట. దీంతో ఆ పాత్రకి నో చెప్పిందట రాసి. ఇటీవలే ఆమె ఆ విషయాన్ని వెల్లడించింది. మోకాళ్లపై తొడలు కనిపించేలా చీర కట్టుకోవాలంటే నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. పెద్ద సినిమా అయినప్పటికీ ఇలాంటి పాత్రలలో నన్ను చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇష్టపడరు. అందుకే నో చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే రాసి రిజక్ట్ చేయడంతో ఈ సువర్ణావకాశం అనసూయ తలుపు తట్టింది. చివరికి అనసూయ కెరీర్ను మలుపు తిప్పింది రంగస్థలం సినిమా.