టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం నితిన్ ఇప్పటికే మాచర్ల నియోజక వర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా , కృతి శెట్టి ఈ మూవీ లో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. సముద్ర కని ఈ మూవీ కి  దర్శకత్వం వహించగా , మహతి స్వర సాగర్మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది.

దానితో మాచర్ల నియోజ కవర్గం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద రేంజ్ వసూళ్ల ను కూడా రాబట్ట లేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచిన మాచర్ల నియోజక వర్గం మూవీ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మాచర్ల నియోజక వర్గం మూవీ డిజిటల్ హక్కులను జీ 5 సంస్థ దక్కించుకుంది. డిసెంబర్ 9 వ తేదీ నుండి ఈ మూవీ ని జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తాజాగా జీ 5 "ఓ టి టి" సంస్థ అధికారికంగా ప్రకటించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: