టాలీవుడ్ లో సీనియర్ నటుడు పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. చైల్డ్ యాక్టర్ మొదట తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా నటించారు.. నువ్వు నాకు నచ్చావ్, పెళ్లి వంటి సినిమాలలో నటించి బాగానే గుర్తింపు సంపాదించారు పృథ్వీరాజ్.. రీసెంట్గా యానిమల్ సినిమాలో విలన్ గా నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.. అయితే గడిచిన కొన్ని నెలల క్రితం పృథ్వీరాజ్ ,శితల్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. ఆ వెంటనే కొన్ని నెలలకే విడాకులు ఇచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. దీంతో తాజాగా ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చింది శీతల్..


పృధ్విరాజ్- శీతల మధ్య దాదాపుగా 30 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. అయితే వీరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారని వార్తలు రావడంతో తాజాగా ఇంస్టాగ్రామ్ లో స్టోరీస్ లో పృధ్వి రాజుతో తాను డీ వర్డ్స్ తీసుకోలేదంటూ ప్రకటించింది.. మాకు అసలు పెళ్లి కాలేదు ఇప్పటివరకు మేము లివింగ్ రిలేషన్లో ఉన్నాము అనుకోని కారణాలవల్ల మా ఇద్దరి రిలేషన్ ఆగిపోయింది. కాబట్టి మేమిద్దరం వేరువేరుగానే జీవితాన్ని ముందుకు సాగిస్తున్నామంటూ తెలిపింది శీతల్..


మా నిర్ణయాన్ని అందరూ దయచేసి గౌరవిస్తూ మాకు ఎటువంటి ఇబ్బందులను కలిగించొద్దండి అంటూ శితల్ పోస్ట్ చేసింది.. 1994లో మొదటిసారి బినాను వివాహం చేసుకున్నారు పృథ్వీరాజ్ వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే గత కొంతకాలంగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. 2022లో చట్ట పరంగా విడాకులు తీసుకొని వేరువేరుగా ఉంటున్నారు ఆ తర్వాత కొంతకాలానికి ఒంటరిగా ఉన్న పృథ్వీరాజ్ శితల్ అనే అమ్మాయికి దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు తాజాగా శితల్ తమకు వివాహం కాలేదని కేవలం మేమిద్దరం లివింగ్ రిలేషన్ లో ఉన్నామంటూ తెలియజేయడమే కాకుండా ఇప్పుడు ఆ బంధం కూడా తెగిపోయిందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: