టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. గోపీచంద్ చాలా రోజుల క్రితం విడుదల అయినటువంటి సిటీమార్ మూవీ తో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు . ఆ తరువాత పక్క కమర్షియల్ ... రామబాణం సినిమాలతో వరస అపజాయలను ఎదుర్కొన్నాడు . అలా రెండు వరస అపజయాల తర్వాత తాజాగా గోపీచంద్ "బీమా" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందు కు వచ్చాడు.

ఈ సినిమాతో అయిన గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటాడు అని ఆయన అభిమాను లు ... కొంత మంది ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా గోపీచంద్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందిం చలేక పోయింది. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ , శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కూడా స్పీడ్ గా జరుగుతూ ఉండడం తో గోపీ చంద్ తన తదుపరి మూవీ పై కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీ చంద్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాధాకృష్ణ , గోపీచంద్ కు ఓ కథ ను వినిపించగా ఆ కథ సూపర్ గా నచ్చడంతో గోపి వెంటనే ఈయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో గోపీచంద్ హీరో గా రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో జిల్ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc