టాలీవుడ్ కి మరో హీరోయిన్ పరిచయం అవుతుంది.క్యూట్ బ్యూటీ ఆయుషి పటేల్ కలియుగం పట్టణంలో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి రమాకాంత్ రెడ్డి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించారు.డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి మరియు కాటం రమేష్‌లు నిర్మించిన కలియుగం పట్టణంలో మూవీ నేడు (మార్చి 29 )న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ఆయుషి పటేల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలియజేశారు.ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మల్టిపుల్ షేడ్స్ తో కూడి ఉంటుంది.. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా మాత్రం ఉండదు. ఒక్కో సీన్‌లో ఒక్కోలా ప్రేక్షకులకు సరికొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో నా పాత్రకు ఇంటర్వెల్‌లో ఒకలా, క్లైమాక్స్‌లో మరోలా ఒపీనియన్ వస్తుంది. 

ఈ సినిమాను కడపలో అందమైన లొకేషన్స్ లో షూట్ చేసాము.అక్కడి ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. చాలా పార్ట్ అక్కడే షూట్ చేశాం. కొంత మాత్రం హైద్రాబాద్‌లో షూట్ చేశాం.చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. నేను పవన్ కల్యాణ్ గారి అభిమానిని. ఆయనలానే ఎదగాలని అనుకునేదానిని.ఈ మూవీ నాకు ఓ మేనేజర్ వల్ల వచ్చింది. ఈ మూవీ కోసం ఎన్నో వర్క్ షాప్స్ చేశాం. ఆ టైంలోనే హీరో విశ్వతో కలిసి ఎన్నో సీన్ల గురించి చర్చించుకున్నాం. ప్రస్తుతం మేం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం టూర్స్ వేస్తున్నాం. వెళ్లిన ప్రతీ చోటా కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది.మా దర్శకుడు రెండు గంటలకు పైగా నాకు కథను నెరేట్ చేశారు. ఎంతో సరదాగా షూటింగ్ చేసేవారు.నాకు కథ ఏం చెప్పారో అదే తీశారు.ఇంత మంచి వ్యక్తితో నా మొదటి సినిమా రావడం ఆనందంగా ఉంది.కలియుగం పట్టణంలో రిలీజ్ కాకముందే నాకు మూడు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ వంటివి నాకు నచ్చదు. అందుకే చాలా సినిమాలు అస్సలు ఒప్పుకోలేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నా అని ఆమె తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి: