నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “కమిటీ కుర్రోళ్ళు” పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి మరియు శ్రీరాధా దామోదర్ స్టూడి యోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందు తుంది.ఈ చిత్రంతో యదు వంశీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.అలాగే ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు.తాజా గా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయి నట్లు మేకర్స్ తెలిపారు.పక్కా ప్లానింగ్ తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసారు.ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.ఈ చిత్ర నిర్మాత అయిన నిహారిక కొణిదెల మాట్లాడుతూ ''మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మొదటి చిత్రం అయిన “కమిటీ కుర్రోళ్ళు”సినిమాను శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ తో కలిసి నిర్మించడం ఎంతో ఆనందం గా వుంది.అంతా కొత్త వాళ్ళ తోనే ఈ సినిమాను మేము పూర్తి చేసాము.ఈ సినిమా కచ్చితం గా ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది అని నిహారిక తెలిపారు.చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ 'దర్శకుడిగా నా తొలి సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ అందించిన సపోర్ట్‌తో సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు జరుగు తున్నాయి.. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ ని పరిచయం చేస్తున్నాం' అన్నారు.

శ్రీరాధా దామోదర్ స్టూడియో ఫణి, జయలక్ష్మి మాట్లా డుతూ 'మంచి కంటెంట్ ఉన్న సినిమా లను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశం తో ముందుకు వచ్చాం. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉంది. కమిటీ కుర్రోళ్ళు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసు కుంటోంది. త్వర లోనే రిలీజ్ డేట్ సహా ఇతర వివరాలను తెలియజేస్తాం' అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: