కలర్స్ స్వాతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట బుల్లితెరపై యాంకర్ గా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు వెండితెరపై హీరోయిన్గా ఆకట్టుకునే స్థాయికి వచ్చింది. అయితే ఒకప్పుడు ఈమె కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా పరిచయమైంది. ఇక ఆ షో పేరుని తన పేరుగా ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు. ఆ తరువాత అష్టా చమ్మా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. దాని తర్వాత కార్తికేయ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. 

అనంతరం పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇటీవల మంత్ ఆఫ్ మధు సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలు యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తోంది కలర్స్ స్వాతి. ఈ క్రమంలోనే తను మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒక వార్తలో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంది అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేపారు. ప్రస్తుతం అవి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్

 అవుతున్నాయి. అయితే ఇంతలా తనను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం స్పందించలేదు స్వాతి. ఇటీవలే తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోకు ఓ నెటిజన్ ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్ చేశారు. స్వాతి షేర్ చేసిన వీడియోలకు రిప్లై ఇస్తూ.. ‘ఛీ.. నీ బతుకు’ అంటూ కామెంట్ చేశాడు. ఇక ఇది చూసిన స్వాతి తన స్టైల్లో రిప్లై ఇఛ్చింది. నాకు కూడా కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంది. నాక్కూడా కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది. జీరో పోస్ట్ ఛాంపియన్స్ అంటూ కౌంటరిచ్చింది.  ఇటీవలే మంత్ ఆఫ్ మధు తో మరోసారి నటనతో మెప్పించింది. ఇప్పుడిప్పుడు బ్యాక్ టూ బ్యాక్ లు చేస్తూ బిజీగా ఉంటున్న స్వాతి.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: