మహేష్ రాజమౌళి కాంబో సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే, వివిధ నివేదికలు మరియు సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా 2027 మార్చి 25న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి 'RRR' చిత్రం ఇదే తేదీన విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో, ఆ సెంటిమెంట్‌ను కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ భారీ బడ్జెట్ అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం కెన్యాలో జరగాల్సిన షూటింగ్ ఇతర కారణాల ఇతర దేశాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.  ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.  మొదట రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు రాజమౌళి దీన్ని ఒకే భాగంగా తీయాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

సినిమా నిర్మాణం భారీ స్థాయిలో జరుగుతోంది. అయినప్పటికీ, అధికారిక ప్రకటన వెలువడే వరకు విడుదల తేదీపై ఎలాంటి నిర్ధారణ లేదు. అభిమానులు మాత్రం ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమాను దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.

రాజమౌళి RRRతో గ్లోబల్ ఫేమ్ సాధించిన తర్వాత, SSMB29ని పాన్-వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ఇది హాలీవుడ్ స్థాయిలో నిర్మించబడుతుందని అంచనా వేస్తున్నారు.  ఈ సినిమాలో మహేష్ బాబు సాహస వీరుడి పాత్రలో కనిపించనున్నారు. మహేష్ రాజమౌళి కాంబో  సినిమా డిజిటల్ హక్కులు ఊహించని మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: