
అయితే అది వెండి తెర మీద కాదు.. వీరుద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది. ఇది కొత్త సినిమా కోసం కాదని, “బాహుబలి ది ఎపిక్” ప్రమోషన్ల కోసం అని తెలుస్తోంది. రాజమౌళి రూపొందించిన ఈ పాన్ ఇండియా మాస్టర్పీస్ రీ రిలీజ్ కానుండటంతో, ప్రమోషన్ ఈవెంట్లలో ప్రభాస్ - అనుష్క ఇద్దరూ పాల్గొనే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఫ్యాన్స్లో ఇప్పటికే భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. చాలాకాలంగా మిస్ అవుతున్న వారి ఫేవరేట్ జంటను మళ్లీ కలిసి చూడబోతున్నారనే ఆలోచన అనుష్క, ప్రభాస్ ఫ్యాన్స్కు ట్రీట్ లాంటిది. నిజంగా ఈ కలయిక జరిగితే, అది కేవలం ప్రమోషన్లకే పరిమితమైనా, అభిమానులకు గోల్డెన్ మూమెంట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
ఇక ఈ రీయూనియన్ ఎప్పుడు జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో అధికారిక సమాచారం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా, ప్రభాస్ - అనుష్క మళ్లీ ఒకే వేదికపై కనిపించే రోజు దగ్గర్లోనే ఉండబోతోందన్న ఊహాగానాలు అభిమానుల హృదయాల్లో సంతోషం నింపుతున్నాయి.