ఇక ఈ ప్రాజెక్ట్ కోసం బాలయ్య స్వయంగా స్క్రిప్ట్ వర్క్లో పాల్గొని స్టోరీబోర్డ్ వరకు రెడీ చేశారు. ఒకానొక టైంలో తానే దర్శకుడిగా వ్యవహరించాలనుకున్నా ఆ ఆలోచనను తరువాత వదిలేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్తగా దర్శకుడిగా క్రిష్ పేరు వినిపిస్తోంది. బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి చేసిన క్రిష్, మరోసారి ఆయనతో కలసి ఈ ప్రాజెక్ట్కి మెగాఫోన్ పట్టే అవకాశం ఉందన్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి. శాతకర్ణి తర్వాత క్రిష్ బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డైరెక్ట్ చేసినా అవి రెండు అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సరిగా ఆడలేదు.
ఈ క్రేజీ సీక్వెల్లో మరో ఆసక్తికర అంశం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ. ఈ సీక్వెల్లో ఆయన కూడా కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్రిష్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఘాటి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని అడిగినప్పుడు, “ఆదిత్య 999 గురించి మాట్లాడాల్సింది బాలయ్యే. నేను చెప్పలేను” అని సమాధానం ఇచ్చారు. అలాగే మోక్షజ్ఞ నటిస్తాడన్న ప్రశ్నపై కూడా అదే విధంగా స్పందించారు. ఘాటి నిర్మాత, క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డి మాత్రం ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్పై చర్చలు జరుగుతున్నాయనే సంకేతం ఇచ్చారు. కానీ అంతకుమించి వివరాలు బయటపెట్టలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వాస్తవంగా లాక్ అయ్యిందా? లాంచ్ ఎప్పుడు జరుగుతుంది? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి