యంగ్ హీరో అడ‌వి శేష్ అన్ని తానై న‌టించిన ఎవ‌రు సినిమా విజ‌య‌వంతంగా తొలి వారం కంప్లీట్ చేసుకుంది. గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు ప్రీమియ‌ర్ల నుంచే పాజిటివ్ టాక్ నడుస్తోంది. మరి వసూళ్ల సంగతేంటి ? అన్న‌ది చూస్తే సినిమా అమ్మ‌కాలు.. వ‌సూళ్లు చూసుకుంటే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట‌లో న‌డుస్తోంది. ఈ వారం టాలీవుడ్‌లో చెప్పుకోద‌గ్గ సినిమాలు లేక‌పోవ‌డంతో ఈ వారం కూడా ఎవ‌రుకు ఎదురు లేకుండా పోయింది. 


వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 9 కోట్ల రూపాయల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 9.50 కొట్ల‌ రూపాయలకు అమ్మారు. అంటే దాదాపు బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక రెండో వారం ఈ సినిమాకు వ‌చ్చే వ‌సూళ్లు అన్ని లాభాల కిందే లెక్క‌. నైజాంలో ఎవ‌రు సూప‌ర్బ్ పెర్పామెన్స్ ఇచ్చింది. 
ఒక్క నైజాం నుంచే ఈ సినిమాకు వారం రోజుల్లలో 2.90 కోట్ల షేర్ తెచ్చింది.


ఆంధ్రా ఏరియా నుంచి 2.85 కోట్లు,  సీడెడ్ నుంచి 90 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఓవర్సీస్ లో ఈ సినిమాకు 3 లక్షల 70 వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఆస్ట్రేలియా, యూఏఈలో కూడా ఈ సినిమా బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. ఏదేమైనా అడ‌వి శేష్ వ‌రుస హిట్ల ప‌రంప‌ర‌లో మ‌రో సినిమా వ‌చ్చి చేరింది. 


ఈ సినిమాతో అడవి శేష్‌కు వ‌రుస పెట్టి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో కూడా శేషు సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఇక స్పానిష్ మూవీ ది ఇన్విజబుల్ గెస్ట్ సినిమాకు రీమేక్ గా ఎవరు సినిమాను తెరకెక్కించారు. వెంకట్ రామ్ జీ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: