ఈ మద్య వెండి తెర, బుల్లి తెర నటులు మృతి చెందడం ఇండస్ట్రీలని ఎంతో బాధిస్తున్నాయి.  గత మూడు నెలల క్రితం వరుసగా దాసరి, సినారే, రవితేజ తమ్ముడు భరత్ ..కొంత మంది టివి నటులు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ టివి నటుడు  నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.    'మహానది', 'త్రివేణి సంగమ', 'మధుబాల' వంటి కన్నడ సీరియల్స్‌ లో ప్రధాన పాత్రలు పోషించిన రచన (23), జీవన్ (25) లు రోడ్డు ప్రమాదం బారినపడ్డారు.   ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.  
Image result for Kannada TV actors Rachana and Jeevan die
వివరాల్లోకి వెళితే..కార్తిక్ అనే టీవీ నటుడి పుట్టినరోజును పురస్కరించుకుని, రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్‌, జీవన్, రచన బెంగుళూరు సమీపంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లారు.  అక్కడ దర్శనం చేసుకొని  పూజలు నిర్వహించి, పార్టీ చేసుకున్నారు. తెల్లవారు జామున సఫారీలో బెంగుళూరు  రిటన్ వస్తున్నారు.
Image result for Kannada TV actors Rachana and Jeevan die
అయితే మాగుడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి వద్దకు రాగానే రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్‌ ఒక్కసారే ఢీ కొట్టడంతో రచన, జీవన్ అక్కడికక్కడే మృతి చెందగా, రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: