ప్రేమ పేరు తో మగాళ్లు మృగాళ్లుగా మారుతు న్నారు. రోజుకో విదంగా అమ్మాయిలతో స్నేహంగా ఉండి మరి దారుణాలకు  పాల్పడుతున్నారు .. ప్రేమపేరుతో మానవ మృగాలు విరుచుకుపడుతున్నాయి. మహిళలపై దారుణాలకు తెగబడుతున్నాయి. ప్రేమను నిరాకరించిందని మారణాయుధాలతో దాడులు చేయడం.. నిలువునా మంట ల్లో కాల్చేస్తున్న ఘటనలు కలవర పరుస్తున్నాయి. నాగ్‌పూర్‌ లో ఓ ప్రేమోన్మాది లేడీ లెక్చరర్‌పై పెట్రోల్ పోసి నిప్పింటించిన ఘటన మరువక ముందే తెలంగాణలో మరో ఘటన చోటుచేసుకుంది.

 

 


తన ప్రేమను అమ్మాయి నిరాకరించదని కోపంతో ఉన్మాదిగా మారాడు. అందుకే అలాంటి వాళ్ళను నమ్మొద్దని ఎంత చెప్పిన కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పై పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో బాలిక పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది. 

 

 

 

అసలు విషయానికొస్తే.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురానికి చెందిన ఓ బాలకను కొద్ది కాలంగా ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. వెంటపడుతున్నా.. బతిమాలుతున్నా ఆమె పట్టించుకోకపోవడం తో ఉన్మాదిగా మారి ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.వెంటనే శరీరం పై ఉన్న బట్టలు పూర్తిగా కాలిపోయాయి. అంతేకాకుండా ఆమె భయంతో పరుగులుతీసింది . 

 

 


ఒళ్లంతా మంటలు వ్యాపించడంతో బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు స్పందించి మంటలను ఆర్పివేశారు. చికిత్స నిమిత్తం బాలికను వరంగల్ ఆస్పత్రికి తరలించారు. బాలిక కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలను తీసుకొచ్చిన కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పై పలు చోట్ల నిరసనలు వెలువెత్తుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: