దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్ హైదరాబాద్ లోనూ కొనసాగుతుంది. ఈ భారత్ బంద్ కి టిఆర్ఎస్ పార్టీ తో పాటు మిగిలిన రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా బంద్ కి మద్దతు తెలిపాయి.. దీంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు.. రైతులు చేస్తున్న ఉద్యమానికి నేడు భారత్ బంద్ ప్రకటించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు క్యాబ్ బంద్ చేయనున్నట్లు ఆటో డ్రైవర్ల యూనియన్స్ ప్రకటించాయి.. ఈ భారత్ బంద్ కు బీజేపీ పార్టీ మద్దతు తెలపకపోవడంతో ఆ పార్టీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు బందును విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.. భారత్ బంద్ నేపథ్యంలో సోమవారం నుంచే జిల్లాల వ్యాప్తంగా ర్యాలీలు సమావేశాలు నిర్వహించారు...
బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు ఎదుర్కొనక తప్పలేదు. ఆర్టీసీ తో పాటు వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా మూసివేసి ఉంచారు. అలాగే కార్మికులు ,ఉద్యోగులు మరియు నిరుద్యోగులు అందరూ ఈ బంద్ కి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు... తెలంగాాణ వ్యాప్తంగా ఈ బంద్ ప్రభావం పాక్షికంగా కొనసాగుతుంది ...హైదరాబాద్ నగరంలో బంద్ ప్రభావం అంతగా కనబడకపోవడం విశేషం..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ చట్టాలను మార్చినందుకు గాను రైతులు రగిలిపోతున్నారు... పాత చట్టాలనే ఉంచాలని రైతులు అందరు కలిసి ఏకమయ్యారు... రోజుల తరబడి ఢిల్లీీీీీలోని సింఘ సరిహద్దు వద్ద ఉద్యమం చేస్తున్నారు.. రైతులు ఇలా చేయడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి... ఎంతోమంది నటులు మరియుు క్రీడా ప్రముఖులు వారికి అండగా నిలుస్తున్నారు.. అంతేకాదు తమకు ఇచ్చిన అవార్డులను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు.. రైతులు కోరిన విధంగా కేంద్ర ప్రభుత్వం చేయకపోవడంపై బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి.. పలుమార్లు రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వన్భే టీలు జరపగా అవి విఫలం కావడంతో ఈ ఉద్యమం తారా స్థాయికి వెళ్లి దేశాన్ని కుదిపేస్తుంది..