ఆయా జిల్లాల్లో ఉండే జిల్లా కలెక్టర్ ప్రెసిడెంట్గా ఉండే ‘డిస్ట్రిక్ట్ పర్చేజింగ్ కమిటీ’ రైతులకు ఉపయోగపడే అత్యాధునిక వ్యవసాయ పరికరాలు కొనేందుకు కావాల్సిన నగదును అందిస్తుంది. ‘కస్టమ్ హైరింగ్ సెంటర్’కు ట్రాక్టర్, ట్రాలీ, రోటవేటర్, కల్టివేటర్, ఫ్లవ్, ప్యాడి బేటర్, మేజ్ షెల్లర్ లాంటి పనిముట్లను ఈ సెంటర్ ద్వారా అధికారులు అందించనున్నారు. పంటలకు మందులు స్ర్పే చేసే మెషీన్లు కూడా అందుబాటులో ఉంచనున్నారు. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ సభ్యులు హార్వెస్టర్, మినీ రైస్ మిల్లు లాంటి మెషీన్లు కావాలని తీర్మానాలు చేస్తే అవి కూడా కొనివ్వడం జరుగుతుందని చెబుతున్నారు.
పనిముట్లు కొనలేకపోవడం, కూలీలు దొరక్కపోవడం వంటి సమస్యలతోనే రైతులు అత్యధికంగా ఇబ్బందులు పడుతుంటారని, అయితే వాటిలో పనిముట్ల సమస్యను దూరం చేసేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతోంది. కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతుల కోసం ఈ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్ర సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది.