సూరత్, గుజరాత్ల్లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా బాధితులు ఈ ఆస్పత్రికి తరలి వస్తున్నారు. ఈ కేసుల కోసం సూరత్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటైంది. మహారాష్ట్రలో ఈ ఫంగస్ వల్ల 8 మంది చూపు కోల్పోయారని ఆ రాష్ట్ర వైద్య విద్య పరిశోధన డైరెక్టరేట్ అధిపతి తాత్యారావు లహానే చెప్పారు. ఇదిలా ఉండగా గుజరాత్ ప్రభుత్వం ఈ రోగులకు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తోంది. ఫంగస్ బాధితుల వైద్యం కోసం 5000 వయస్స్ సేకరించింది. గుజరాత్ రాష్ట్రంలో ఇంతవరకు వంద కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో 19 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో అరవై పడకల వంతున రెండు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. వడోదర, సూరత్, రాజ్కోట్, భావనగర్, జామ్నగర్, తదితర ప్రాంతాల్లో ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయి.
మహారాష్ట్రలోనూ ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా దేశంలోని గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 3.53 లక్షల మంది కోలుకున్నారు. ఇదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,66,317 మంది కరోనా బారినపడగా, ఇదే సమయంలో కరోనా మృతుల సంఖ్య కొద్దిగా క్షీణించి 3,747 వద్ద ఆగిపోయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. 24 గంటల్లో కరోనాతో 3,747 మంది మృతి చెందగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,46,146 కు చేరింది.