శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులను విమానం దక్షిణ ద్వీపమైన మిండానావోలోని కాగయాన్ డి ఓరో నుండి దళాలను తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది. కూలిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. దీంతో కొందరు ఆ శిథిలాల్లోనే కాలిపోయినట్టు సమాచారం. పదిహేడు మృతదేహాలు లభించాయి. 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రమాదానికి గురైన సి-130 విమానంలో ప్రయాణించిన సిబ్బంది ఇటీవల ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. వారిని ఉగ్రవాద పోరుకు సిద్ధం చేశారు. అంతేకాదు విమానంలో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కూడా ఉన్నారు. విమానం కూలిన ప్రదేశమైన జోలో ద్వీపంలో టెర్రరిస్టులు ఎక్కువగా మనుగడ సాగిస్తుంటారు. విమానంపై దాడి జరిగినట్టు ఎలాంటి సంకేతాలు లేవనీ.. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.