బాలయ్య కన్నా బాగా మాట్లాడారు
సోదరి పురంధరి
పొంగిపోతున్నారు అంతా
అభిమానులు అంతా
కష్టకాలంలో సోదరిపై
అనకూడని మాటలు
అంటున్నవారంతా
నిందలు వేస్తున్న వారంతా
ఇప్పుడిక డైలమాలో పడాల్సిందే!
తగ్గాల్సిందే!


చాలా రోజులకు నందమూరి కుటుంబంలోనూ, నారా కుటుంబంలోనూ కలహాలు అన్ని పటాపంచలయ్యాయి అని అనిపిస్తోంది. అంతా నానీని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. నానీ అనగా కొడాలి నానీ అని! ఆయన నందమూరి కుటుంబానికి ఎంతో దగ్గర వ్యక్తి. కావాల్సిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో మనిషి. అలాంటి మనిషి దగ్గరుండి మరీ! అసెంబ్లీలో తమ ఇంటి ఆడబిడ్డను తిట్టిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు నందమూరి కుటుంబ సభ్యులు. ఇదే సమయంలో వీరంతా నారా చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఇదే కోవలో తారక్ మాట్లాడారు. పురంధరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదేవిధంగా కల్యాణ్ రామ్, సుహాసిని తదితర  నందమూరి వారసులు అంతా మాట్లాడారు.

ఇక ఈ విషయంలో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఎన్నడూ నారా కుటుంబంకు మద్దతుగా మాట్టాడని పురంధరి ఇప్పుడు మాత్రం తన రూటు మార్చారు. తన సోదరి భువనేశ్వరి జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే బాలయ్య కన్నా చాలా బాగా మాట్లాడారు. అంతేకాదు మరో ఆసక్తిదాయక విషయం ఏంటంటే రాజధాని ఉద్యమానికి సైతం ఆమె మద్దతిచ్చారు. రాజధాని రైతులు తమ గోడు వినిపించుకోవాలంటూ ధర్మస్థానం నుంచి దేవస్థానం వరకూ చేపట్టిన  పాదయాత్రకు మద్దతిచ్చారు. అంతేకాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదే కేంద్రం నిధులతో అని దీనికి ఎటువంటి అపార్థాలు పడాల్సిన అవసరం లేదు అని,  తాము డబ్బులు ఇవ్వబట్టే ఆ రోజు రాజధాని పనులు ఊపందుకున్నాయని పురంధరి చెప్పి పరోక్షంగా టీడీపీకి ప్రత్యక్షంగా రాజధాని రైతుల గోడుకు అండగా నిలిచి నందమూరి వారింటి బిడ్డ అనిపించుకున్నారు అని టీడీపీ అభిమానులు ఆమెకు జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp